Back to feed
పట్టాలెక్కనున్న దేశీయ తొలి హైడ్రోజన్ రైలు
Vikram Chandra May 29, 2026 10:55 AM అల్ ఇండియా 16 views1 day ago

భారతదేశపు మొట్టమొదటి దేశీయ హైడ్రోజన్ ఇంధన రైలు ప్రయాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ వ్యవస్థతో నడిచే ఈ రైలు, పైలట్ ప్రాజెక్టుగా హరియాణాలోని జీంద్ వేదికగా త్వరలోనే పరుగులు పెట్టనుంది. దీనికోసం అక్కడ రీఫ్యూయెలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాల్లోనే ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. ఇప్పుడు హరియాణాలో ఈ రైలు ప్రారంభం కావడంతో, పర్యావరణ హితమైన హైడ్రోజన్ రైళ్లను నడుపుతున్న అగ్ర దేశాల సరసన భారత్ చేరనుంది.
Comments
Loading comments...


