Back to feed
క్రీడలుBreaking
పాక్పై భారత్ ఘనవిజయం
Sandeep Jun 14, 2026 5:13 PM అల్ ఇండియా 18 viewsabout 17 hours ago

టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు విజయభేరి మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, స్మృతి మంధాన (68) రాణించడంతో 170 పరుగులు చేసింది.
అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ను భారత బౌలర్ దీప్తి శర్మ (5/10) స్పిన్ మాయాజాలంతో వణికించడంతో ఆ జట్టు 106 పరుగులకే పరిమితమైంది.
Comments
Loading comments...



