Back to feed
15 ఏళ్లకే భారత్కు ఎంపికైన కుర్రాడు
Ravi Jun 15, 2026 5:27 AM అల్ ఇండియా 4 viewsabout 4 hours ago

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్లకే అంతర్జాతీయ జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించాడు. అతని ఈ విజయం వెనుక చిన్ననాటి కఠిన శ్రమ ఉందని కోచ్ మనీశ్ ఓఝా తెలిపారు. పదేళ్ల వయసులోనే రోజుకు 8 గంటల పాటు 600 బంతులు ఎదుర్కొనేవాడని చెప్పారు.
సమస్తిపుర్ నుండి అకాడమీకి నిత్యం రెండున్నర గంటలు ప్రయాణించి వచ్చేవాడని, అతడి తండ్రి సంజీవ్ ప్రోత్సాహం ఎనలేనిదని కోచ్ గుర్తుచేసుకున్నారు. తోటి ఆటగాళ్లకు వైభవ్ కుటుంబం భోజనం కూడా అందించేదని కొనియాడారు.
Comments
Loading comments...



