Back to feed
ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామి: ప్రధాని మోదీ
Suresh Jun 19, 2026 2:16 AM అల్ ఇండియా 10 viewsabout 3 hours ago

ప్రపంచానికి భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడుతూ, సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణల దిశగా దేశం వేగంగా దూసుకుపోతోందని ఆయన స్పష్టం చేశారు.
గత 12 ఏళ్లలో మౌలిక వసతులు, జీడీపీ రెట్టింపు అయ్యాయని, 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని మోదీ వివరించారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా వచ్చే ఏడాది 'తృష్ణ' ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...



