వార్తలకు తిరిగి వెళ్లండి
ఐక్యరాజ్యసమితిలో భారత్ నిరసన
సంజయ్ రెడ్డి Jun 24, 2026 9:10 AM అల్ ఇండియా 8 viewsabout 15 hours ago

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. కో-చైర్ హోదాను పాక్ దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత ప్రతినిధి పి.హరీష్ మండిపడ్డారు.
జమ్మూకశ్మీర్ భారత్ అంతర్గత విషయమని ఆయన స్పష్టం చేశారు. వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని, ఐరాస ఆదేశాల అమలులో పాక్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భారత్ హితవు పలికింది.
Comments
Loading comments...