వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పైరసీని అడ్డుకునేందుకు చిత్ర బృందం దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం, సినిమాను ఇంటర్నెట్లో అక్రమంగా ప్రసారం చేయకుండా ‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ జారీ చేసింది.
ఈ డైనమిక్ ఇంజంక్షన్ ద్వారా పైరసీ సైట్లను కట్టడి చేసేందుకు వీలు కలుగుతుంది. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాకు కోర్టు తీసుకున్న నిర్ణయం ఆర్థిక నష్టాల నుంచి పెద్ద భద్రతను కల్పిస్తోంది.
Comments
Loading comments...
