Back to feed
ఆలయాల్లో వీఐపీ దర్శనాలపై హైకోర్టు ఆగ్రహం
Rohit Singh May 29, 2026 1:18 PM అల్ ఇండియా 26 views1 day ago

దేవాలయాల్లో వీఐపీ సంస్కృతిపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేవుడి ముందు అందరూ సమానమేనని, వీఐపీ దర్శనాల పేరుతో సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేసింది. దేవుడు ఎవరి కోసం వేచి ఉండరని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడు పడితే అప్పుడు దర్శనం చేసుకోవడం సరికాదని పేర్కొంది. సామాన్య భక్తులకు సమాన ప్రాధాన్యత కల్పించాలని ఆలయ కమిటీలను ఆదేశించింది.
Comments
Loading comments...


