Back to feed
ఏపీలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్
Sonia Singh Jun 03, 2026 7:17 AM గుంటూరు 11 viewsabout 17 hours ago

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వర్షాల దృష్ట్యా ప్రజలు, రైతులు, పశువుల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని సూచించింది.
Comments
Loading comments...


