Back to feed
ఎండల సెగ.. కరెంట్ బిల్లుల మోత
Ravi Shukla Jun 02, 2026 6:01 AM కరీంనగర్ 15 views1 day ago

ఎండల తీవ్రతతో ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో గృహజ్యోతి లబ్ధిదారులకు కరెంటు బిల్లుల భారం పడుతోంది. విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటడంతో వేలమంది రాయితీని కోల్పోతున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై నెలకు రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది.
మరోవైపు, పెరుగుతున్న వినియోగంతో ప్రభుత్వానికి సైతం రాయితీల భారం భారీగా పెరిగింది. వేసవి తాపంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గడమే కాకుండా, విద్యుత్ డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది.
Comments
Loading comments...



