Back to feed
పసిడి దిగుమతులపై ఆంక్షలు: కేంద్రం కొత్త మార్గదర్శకాలు
Rohit Balakrishnan May 15, 2026 5:29 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

ఆభరణాల ఎగుమతుల కోసం ‘అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీం’ కింద సుంకం లేకుండా చేసుకునే ముడి బంగారం దిగుమతులపై కేంద్రం 100 కిలోల పరిమితి విధించింది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి పరిమితులు లేకపోగా, తాజాగా గురువారం ఈ కొత్త ఆదేశాలు జారీ చేసింది.
పసిడిపై దిగుమతి సుంకాన్ని 6% నుండి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ జాగ్రత్తలు తీసుకుంది. తొలిసారి దరఖాస్తు చేసుకునే సంస్థల తయారీ కేంద్రాలను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేయడాన్ని తప్పనిసరి చేశారు.
Comments
Loading comments...



