Back to feed
కళామందిర్ కొత్త సీఈవోగా భరద్వాజ్ రాచమడుగు
Ravi Shukla May 15, 2026 7:02 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

ప్రముఖ రిటైల్ టెక్స్టైల్ సంస్థ సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భరద్వాజ్ రాచమడుగు నియమితులయ్యారు. గత కొన్నేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న ఆయన, కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
భరద్వాజ్ గ్రూప్ ఈ-కామర్స్ విభాగం, వ్యాపార విస్తరణ, కంపెనీ ఐపీవో (IPO) ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారని సంస్థ ఫౌండర్, ఎండీ ప్రసాద్ చలవాడి తెలిపారు. ఆయన నాయకత్వంలో సంస్థ మరిన్ని మైలురాళ్లను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...



