వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ రిటైల్ టెక్స్టైల్ సంస్థ సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భరద్వాజ్ రాచమడుగు నియమితులయ్యారు. గత కొన్నేళ్లుగా సంస్థతో కొనసాగుతున్న ఆయన, కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
భరద్వాజ్ గ్రూప్ ఈ-కామర్స్ విభాగం, వ్యాపార విస్తరణ, కంపెనీ ఐపీవో (IPO) ప్రక్రియలను విజయవంతంగా నిర్వహించారని సంస్థ ఫౌండర్, ఎండీ ప్రసాద్ చలవాడి తెలిపారు. ఆయన నాయకత్వంలో సంస్థ మరిన్ని మైలురాళ్లను అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

