వార్తలకు తిరిగి వెళ్లండి
జార్జియా పార్లమెంట్లో ఎంపీల మధ్య ఘర్షణ
కిరణ్ కుమార్ Jun 27, 2026 6:21 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
జార్జియా పార్లమెంట్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధాని ఇరాక్లీ కొబఖిడ్జే వార్షిక నివేదిక సమర్పించిన తర్వాత జరిగిన చర్చ సందర్భంగా, 'జార్జియన్ డ్రీమ్', 'ఫర్ జార్జియా' పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఎంపీలు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Loading comments...