Back to feed
చెరువులో నలుగురు యువకులు గల్లంతు
Ravish Kumar Jun 07, 2026 8:23 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నద్రాయ్ పిక్నిక్ పాయింట్ వద్ద ఉన్న హజారా కాలువలో స్నానానికి దిగిన ముగ్గురు సోదరులతో పాటు మరో యువకుడు నీటిలో గల్లంతయ్యారు. వీరంతా హత్రాస్ జిల్లా టిక్రి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
వెంటనే రంగంలోకి దిగిన పీఏసీ డైవర్లు ఒక యువకుడిని సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీశారు. నీటిలో మునిగిపోయిన మిగిలిన ముగ్గురు సోదరుల కోసం జిల్లా యంత్రాంగం, పోలీసులు మరియు రెస్క్యూ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Comments
Loading comments...


