Back to feed
రైతుల అభిప్రాయాలకే ప్రాధాన్యం: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
Nisha Sharma Jun 02, 2026 10:46 AM అమరావతి 34 views1 day ago

రాజధాని ప్రాంత రైతులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించగా, భవిష్యత్తులో రైతుల అభిప్రాయాలకే తమ ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.
రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకే దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతులను బలవంతపెట్టి ఎలాంటి నిర్ణయాలు అమలు చేయడం ప్రభుత్వాలకు మంచిది కాదని జగన్ హితవు పలికారు.
Comments
Loading comments...


