Back to feed
వివాహేతర సంబంధం: యువకుడి దారుణ హత్య
Rohit Verma May 31, 2026 6:36 AM సిద్దిపేట 3 viewsabout 1 hour ago

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహితతో శ్యామ్ అనే యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమెకు భర్త విడాకులు ఇచ్చాడు.
ఈ విడాకులకు శ్యామ్ కారణమని ఆగ్రహించిన సదరు మహిళ బంధువులు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్యామ్ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

