Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏసీ పేలి మాజీ ఐఏఎస్ మృతి

Vikram Joshi May 29, 2026 5:29 AM అల్ ఇండియా 7 views1 day ago
ఏసీ పేలి మాజీ ఐఏఎస్ మృతి - Udayam Digital
ఢిల్లీలో ఇంట్లో ఏసీ పేలిన ప్రమాదంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ కన్నుమూశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు, పొగ చెలరేగడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో గాయపడిన ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Comments

G
Loading comments...