వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇద్దరు వృద్ధురాళ్లు సజీవదహనమయ్యారు. రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో వలగాని సావిత్రి (60), ఆమె సోదరి పూలమ్మ (65) నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
సూర్యాపేట నుంచి చెల్లిని చూసేందుకు వచ్చిన పూలమ్మ ఈ ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదం నింపింది. మంటల ధాటికి ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు, పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా పాక్షికంగా దగ్ధమైంది.
Comments
Loading comments...

