వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు ఎబోలా అనుమానితులు చేరారు. సూడాన్ నుండి వచ్చిన ఒకరిలో లక్షణాలు కనిపించగా, అతనితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా అధికారులు అప్రమత్తమై ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరిద్దరికీ ప్రత్యేక పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ ద్వారా వీరిని గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరి రక్త నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్కు పంపారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

