Back to feed
ఓటీటీలోకి దృశ్యం 3.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Anita Joshi Jun 13, 2026 6:02 AM అల్ ఇండియా 11 views2 days ago

మలయాళ స్టార్ హీరో మోహన్లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 18 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ మూడో భాగంలో జార్జ్కుట్టి కుటుంబంపై శత్రువులు, పోలీసులు కలిసి పన్నిన సరికొత్త కుట్రను ఛేదించే ఆసక్తికర కథాంశంతో సినిమా తెరకెక్కింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుందని ఓటీటీ ప్లాట్ఫామ్ అధికారికంగా ప్రకటించింది.
Comments
Loading comments...



