Back to feed
జూన్ 2న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం
Ravi Shukla May 28, 2026 5:31 AM కరీంనగర్ 5 viewsabout 1 hour ago

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం వేగవంతం చేసింది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్లలో సుమారు 1,660 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు పనులు తుది దశకు చేరుకున్నాయి.
నిరుపేదలకు ఇళ్లు కేటాయించేలా అధికారులు సర్వే పూర్తి చేశారు. జూన్ రెండో తేదీన మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు గృహప్రవేశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మంత్రి ఆదేశాల మేరకు పంపిణీ ప్రక్రియ సాగుతోంది.
Comments
Loading comments...


