వార్తలకు తిరిగి వెళ్లండి
డాక్టర్ బుధ్రీ తాతీకి ‘పద్మశ్రీ’ పురస్కారం
లక్ష్మి దేవి Jun 24, 2026 8:53 AM అల్ ఇండియా 2 viewsabout 15 hours ago

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట కృషికి గానూ ప్రముఖ కార్యకర్త డాక్టర్ బుధ్రీ తాతీకి ‘పద్మశ్రీ’ అవార్డు దక్కింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు.
బస్తర్ గిరిజన ప్రాంతాల్లో మహిళలకు విద్యనందిస్తూ, స్వయం ఉపాధి ద్వారా వారిని స్వాలంబన వైపు నడిపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో మహిళా సాధికారతకు ఆమె నిరంతరం శ్రమిస్తున్నారు.
Comments
Loading comments...