వార్తలకు తిరిగి వెళ్లండి

మే 16న జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాల్పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది.
జగిత్యాల జిల్లాలో గత నాలుగేళ్లుగా వందలాది కేసులు నమోదు కాగా, ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు ఇద్దరు బాధితులను గుర్తించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వ్యాధి నియంత్రణపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
Comments
Loading comments...

