Back to feed
కస్టోడియల్ మరణం: పోలీసులకు షాక్ ఇచ్చిన హైకోర్టు
Sana Jun 18, 2026 12:08 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago

నిందితులను కొట్టి చంపడం పోలీసుల 'అధికారిక విధి' కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో విచారణకు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదని తేల్చి చెబుతూ, నిందితులైన పోలీసుల పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
కస్టోడియల్ మరణాలు సమాజంలో అత్యంత ఘోరమైన నేరాలని కోర్టు పేర్కొంది. థర్డ్ డిగ్రీ ప్రయోగించి రికార్డులు ఫోర్జరీ చేసిన పోలీసులకు ఎటువంటి చట్టపరమైన రక్షణ కవచాలు ఉండవని, బాధ్యులపై విచారణ కొనసాగుతుందని న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది.
Comments
Loading comments...



