Back to feed
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
Rohit Singh Jun 08, 2026 5:37 AM కాకినాడ 4 viewsabout 2 hours ago

కాకినాడ జిల్లా గొల్లప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తునికి చెందిన జూ రెడ్డి వెంకటరమణ, అరుణకుమారి దంపతులు మృతి చెందారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మరణించగా, భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. డ్రైవర్ పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...



