Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

Rohit Singh Jun 07, 2026 4:35 AM తిరుపతి 4 viewsabout 3 hours ago
తిరుమల:  శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం - Udayam Digital
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 90,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 52,236 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...