Back to feed
ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధిని వివరించండి: మంత్రులకు సీఎం ఆదేశం
Rohit Sharma Jun 04, 2026 9:34 AM అమరావతి 2 viewsabout 3 hours ago

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులంతా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత రెండేళ్లలో తమ శాఖల పరంగా సాధించిన ప్రగతిని ఈనెల 28లోగా ప్రజలకు వివరించాలని కేబినెట్ సమావేశంలో స్పష్టం చేశారు.
అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ వేయాలని, 16 వేల టీచర్ పోస్టుల భర్తీపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. అమరావతితో పాటు పలు నగరాల్లో యోగా డే నిర్వహించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
Comments
Loading comments...


