Back to feed
పశ్చిమగోదావరిలో దొంగ అరెస్ట్: బంగారం, వెండి స్వాధీనం
Kavita Singh Jun 04, 2026 10:18 AM పశ్చిమగోదావరి జిల్లా 2 viewsabout 2 hours ago

పశ్చిమగోదావరి జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన కొత్తపల్లి నరేష్ను పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 142 గ్రాముల బంగారం, 4 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ సుధాకర రావు తెలిపారు.
రాజమహేంద్రవరానికి చెందిన మరో నిందితుడు గోడి సతీష్ కుమార్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. నిందితుడు నరసాపురం, పోడూరు, పెనుమంట్ర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...


