Back to feed
తెలంగాణ ప్రగతికి కేంద్రం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ
Rohit Singh Jun 02, 2026 5:12 AM హైదరాబాద్ 14 views2 days ago

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణలకు, పారిశ్రామిక స్ఫూర్తికి నిదర్శనమని, ఇక్కడి ప్రజల ధైర్యసాహసాలు చరిత్రకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) నిర్మాణంలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతి, వారసత్వం ఎంతో గొప్పవని ప్రశంసించిన ఆయన, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...



