Latest ఎడ్యుకేషన్ news and updates
కొన్ని సబ్జెక్టుల ‘క్యూయెట్’ పీజీ పరీక్షలను ఒకటి కంటే ఎక్కువ తేదీల్లో నిర్వహించడంతో సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలపై జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) స్పందించింది. నార్మలైజేషన్ (మార్కుల సాధారణీకరణ) విధానం అమలుపై విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేస్తూ పత్రికా ప్రకటన ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.