వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్లోని మొహాలీలో ఓ ప్రేమోన్మాది తన మాజీ ప్రియురాలిని ఆఫీసులో అందరూ చూస్తుండగానే కత్తితో 20 సార్లు పొడిచి హత్య చేశాడు. ప్రేమను నిరాకరించిందనే కక్షతో నిందితుడు హర్జిందర్ సింగ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ దాడి తర్వాత నిందితుడు తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

