Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పాలీమర్ కరెన్సీపై ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన

Vikram Chandra Jun 05, 2026 9:13 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
పాలీమర్ కరెన్సీపై ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన - Udayam Digital
ప్లాస్టిక్ (పాలీమర్) కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. కాగితపు నోట్ల మన్నికను పెంచేందుకు గతంలో చేసిన ప్రయత్నాలు సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు, నోట్ల మన్నికను పెంచడానికి, ఖర్చును తగ్గించడానికి వార్నిష్డ్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. ఈ వార్నిష్ పూత కలిగిన నోట్లు సాధారణ కరెన్సీ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...