వార్తలకు తిరిగి వెళ్లండి
సముద్రంలో పడవలు మునిగి 500 మంది మృతి

బంగాళాఖాతంలో రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ఘోర దుర్ఘటనలో దాదాపు 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అంతర్జాతీయ వలసల సంస్థ, ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
మయన్మార్ లోని రాఖైన్, అయేయార్వాడీ తీరాల నుంచి బయల్దేరిన ఈ రెండు బోట్లు సముద్రంలో మునిగిపోయాయని, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం రెండు పడవల్లోని ప్రయాణికులంతా మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...