Back to feed
ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం: ఐఎండీ
Vikram Chandra May 29, 2026 8:40 AM అల్ ఇండియా 12 views1 day ago

నైరుతీ రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
అలాగే జూన్ నెలలో తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత, హీట్వేవ్ ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. తక్కువ వర్షాల వల్ల వ్యవసాయం, తాగునీటి లభ్యతపై ఒత్తిడి పెరిగి కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
Comments
Loading comments...


