Back to feed
గత పాలనలో నిరంకుశత్వం.. ఇప్పుడు స్వేచ్ఛ: ప్రొఫెసర్ కోదండరాం
Sonia Singh Jun 02, 2026 6:39 AM హైదరాబాద్ 20 views1 day ago

కేసీఆర్ హయాంలో నిరంకుశ వైఖరి నడిచిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ లభించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, రాష్ట్ర అస్తిత్వానికి ఆటంకం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
తాము ఏపీ ప్రజలకు వ్యతిరేకం కాదని, కేవలం ఆంధ్ర పాలకుల పెత్తనాన్నే వ్యతిరేకించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని, కొందరు ఏపీ నేతలు చిన్న విషయాల్లో తలదూర్చడం తగదని ఆయన హితవు పలికారు.
Comments
Loading comments...



