Back to feed
ఆర్మీ వైద్యుల అద్భుతం: చిన్నారి ప్రాణ రక్షణ
Neha Singh May 29, 2026 1:28 PM అల్ ఇండియా 37 views1 day ago

మహారాష్ట్రకు చెందిన 9 నెలల పసికందు పొరపాటున ఎల్ఈడీ బల్బును మింగడంతో అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో పూణేలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియో-థొరాసిక్ సైన్సెస్ వైద్యులు చిన్నారిని చేర్చుకున్నారు.
వైద్యులు అత్యంత క్లిష్టమైన బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, ఊపిరితిత్తుల్లో లోతుగా ఉన్న ఎల్ఈడీని సురక్షితంగా తొలగించారు. ఈ అరుదైన సర్జరీ ద్వారా చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆర్మీ వైద్యులపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Comments
Loading comments...


