Back to feed
కడపలో ఏపీఎల్ రెండో దశ మ్యాచ్లు: రేపే ప్రారంభం
Suresh Jun 16, 2026 5:22 AM అమరావతి 6 viewsabout 1 hour ago

ఏసీఏ ఆధ్వర్యంలో ఏపీఎల్ 2026 రెండో దశ మ్యాచ్లు బుధవారం నుంచి కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ ఫ్లడ్లైట్ల వెలుగులో ఐదు రోజుల పాటు 9 టీ-20 మ్యాచ్లు జరగనున్నాయి. రూ.7 కోట్లతో ఆధునిక వసతులు కల్పించారు.
హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, కేఎస్ భరత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. ప్రతిరోజూ రెండు మ్యాచ్లు జరుగుతాయి. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.
Comments
Loading comments...


