Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కచ్ సరిహద్దుల్లో అమిత్ షా పర్యటన

Suman Sinha May 29, 2026 8:59 AM అల్ ఇండియా 17 views1 day ago
కచ్ సరిహద్దుల్లో అమిత్ షా పర్యటన - Udayam Digital
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మకంగా కీలకమైన కచ్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించనున్నారు. సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, అధికారులతో భద్రతా సవాళ్లపై చర్చిస్తారు. అలాగే ‘బోర్డర్ అవుట్‌పోస్ట్ జీ-7’ను ఆయన ప్రారంభిస్తారు. హరామీ నాలా ప్రాంతంలో బోటు ద్వారా పర్యటించనున్న అమిత్ షా, అనంతరం భుజ్ బిఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. గత ఆరు నెలల్లో కచ్ ప్రాంతంలో హోంమంత్రి పర్యటించడం ఇది రెండోసారి.

Comments

G
Loading comments...