Back to feed
కచ్ సరిహద్దుల్లో అమిత్ షా పర్యటన
Suman Sinha May 29, 2026 8:59 AM అల్ ఇండియా 17 views1 day ago

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా వ్యూహాత్మకంగా కీలకమైన కచ్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించనున్నారు. సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, అధికారులతో భద్రతా సవాళ్లపై చర్చిస్తారు. అలాగే ‘బోర్డర్ అవుట్పోస్ట్ జీ-7’ను ఆయన ప్రారంభిస్తారు.
హరామీ నాలా ప్రాంతంలో బోటు ద్వారా పర్యటించనున్న అమిత్ షా, అనంతరం భుజ్ బిఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. గత ఆరు నెలల్లో కచ్ ప్రాంతంలో హోంమంత్రి పర్యటించడం ఇది రెండోసారి.
Comments
Loading comments...


