Back to feed
అమరవీరుల కుటుంబాలకు ఎయిరిండియా భరోసా
Sonia Singh May 28, 2026 9:06 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎయిరిండియా భారత సైన్యంతో ఒప్పందం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో యుద్ధ వితంతువులు, వారి పిల్లలకు ఏఐ సాట్స్లో 60 ఉద్యోగాలు కల్పిస్తారు. అలాగే, ఆర్మీకి చెందిన 25 ‘ఆశా’ పాఠశాలల్లో అత్యాధునిక వృత్తి శిక్షణా ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ చొరవ ద్వారా వారికి సాంకేతిక నైపుణ్యాలతో పాటు వివిధ రంగాలలో శిక్షణ అందించి, ఆర్థిక సాధికారత కల్పిస్తారు.
Comments
Loading comments...



