వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దుబాయ్లో ఉన్న అజిత్ ఈ విషయం తెలియగానే వెంటనే చెన్నైకి బయలుదేరారు.
మూడేళ్ల క్రితమే అజిత్ తండ్రి మరణించగా, ఇప్పుడు తల్లి కూడా దూరమవడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

