వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్అండ్టీ సంస్థకు ఉన్న వంద శాతం షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ.. రెండో దశ పనులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు.
Comments
Loading comments...

