Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ఆదేశం

Udayam Digital Staff May 02, 2026 9:54 AM హైదరాబాద్ 7 views7 days ago
సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ఆదేశం - Udayam Digital
ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికుల పట్ల సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో కార్మిక సంఘాల భేటీలో వెల్లడైన సమస్యలపై మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా, స్నేహపూర్వక వాతావరణంలో సంస్థను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...