వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికుల పట్ల సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రితో కార్మిక సంఘాల భేటీలో వెల్లడైన సమస్యలపై మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా, స్నేహపూర్వక వాతావరణంలో సంస్థను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

