వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్లో ఈడీ సోదాల వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొహాలీలోని ఒక భవనం తొమ్మిదో అంతస్తు నుండి రూ.500 నోట్ల కట్టల సంచులను నిందితులు కిందకు విసిరేశారు. భూ అక్రమాల కేసులో అధికారులు 12 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు.
వందల కోట్ల అక్రమ దందా ఆరోపణలతో బిల్డర్లు, అధికారుల నివాసాల్లో సోదాలు జరిగాయి. కింద పడిపోయిన నోట్ల కట్టలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై ఈడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు.
Comments
Loading comments...

