వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ దుస్తుల సంస్థ 'డాలర్ ఇండస్ట్రీస్' వ్యవస్థాపకులు దీన్దయాల్ గుప్తా (88) శనివారం కోల్కతాలో కన్నుమూశారు. 1972లో అతి సామాన్యులకు సైతం బ్రాండెడ్ లోదుస్తులు అందించాలనే లక్ష్యంతో ఆయన ఈ సంస్థను ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగారు.
హర్యానాలో జన్మించిన ఆయన తన కృషితో డాలర్ను రూ. 1,700 కోట్ల ఆదాయం కలిగిన దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దారు. ఆయన మృతి పట్ల పారిశ్రామిక వేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.
Comments
Loading comments...

