వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు, విమానయాన రంగానికి కేంద్రం రూ.18,100 కోట్లతో రుణ హామీ పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
మరో కీలక నిర్ణయంలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కి పెంచుతూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థను, న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...

