Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అగ్నిప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Udayam Digital Staff May 03, 2026 6:38 PM అమరావతి 4 views6 days ago
 అగ్నిప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - Udayam Digital
వేసవి కాలంలో పెరిగే ఉష్ణోగ్రతల దృష్ట్యా అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు ఎంసీబీ (MCB)ల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని కోరారు. మాల్స్, సినిమా థియేటర్లు, అపార్ట్‌మెంట్‌లలో ఫైర్ సేఫ్టీ పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపడతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...