Back to feed
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
vikranth Jun 11, 2026 6:30 AM కర్నూలు 6 views4 days ago

ఆదోని మండలం బైచిగేరి-అరేకల్ గ్రామాల మధ్య ద్విచక్ర వాహనం కల్వర్టును ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్ (24) అనే యువకుడు మృతి చెందాడు. ఎమ్మిగనూరుకు చెందిన ఇతను ఆదోనిలోని ఓ స్కూటర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు.
ఆయన పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఉదయ్ను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

