Back to feed
అమరావతి మునకకు బ్రేక్ పడేనా?
Ravish Jun 13, 2026 11:48 AM ఎన్టీఆర్ జిల్లా 19 views2 days ago

రాజధాని అమరావతిలో మౌలిక వసతుల పనులపై మంత్రి పి. నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలంలో నగరంలో నీరు నిలవకుండా చూసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగులపై ఏకంగా 69 వంతెనలను నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వరద ముప్పును శాశ్వతంగా నివారించడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

