Back to feed
వెయిట్లిఫ్టింగ్: జ్ఞానేశ్వరి యాదవ్కు రజతం, కాంస్యం
Rahul Kanwal May 14, 2026 6:05 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

గాంధీనగర్లో జరుగుతున్న ఆసియా సీనియర్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి జ్ఞానేశ్వరి యాదవ్ రెండు పతకాలు సాధించారు. 53 కేజీల విభాగంలో ఆమె స్నాచ్లో రజతం, ఓవరాల్గా 194 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
చైనాకు చెందిన జిన్లాన్ జావో స్వర్ణం గెలుచుకోగా, వియత్నాం క్రీడాకారిణి రజతం సాధించింది. అంతకుముందు కోమల్ కోహర్ భారత్కు కాంస్యం అందించారు. ఈ టోర్నీ 2026 కామన్వెల్త్ గేమ్స్కు క్వాలిఫైయింగ్ ఈవెంట్గా కొనసాగుతోంది.
Comments
Loading comments...



