Back to feed
సోలాపూర్లో విషాదం: బావిలో పడి ఎనిమిది మంది భక్తుల మృతి
Ravi Jun 15, 2026 5:52 AM అల్ ఇండియా 8 viewsabout 4 hours ago

మహారాష్ట్రలోని సోలాపూర్లో భక్తుల వాహనం అదుపుతప్పి బావిలో పడటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా సిద్ధనాథ్ ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా మల్షిరాస్ సమీపంలో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, సీఎం ఫడ్నవీస్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
Comments
Loading comments...



