Back to feed
నెల్లూరులో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
Ravi Jun 16, 2026 3:12 AM నెల్లూరు 3 viewsabout 2 hours ago

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్రావు (65), భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్ (26) ఉరివేసుకుని మృతి చెందారు. తాము శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని మధుసూదన్రావు సూసైడ్ నోట్ రాశారు.
ఆస్తుల పంపకం, విరాళాల గురించి అందులో పేర్కొన్నారు. మృతదేహాల కాళ్లు, చేతులు కట్టి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...



