Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Follow Udayam on Google
Ravi Jun 16, 2026 8:42 AM నెల్లూరుGeneral
నెల్లూరులో విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య - Udayam
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్‌రావు (65), భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్‌ (26) ఉరివేసుకుని మృతి చెందారు. తాము శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, తమ చావుకు ఎవరూ బాధ్యులు కారని మధుసూదన్‌రావు సూసైడ్ నోట్ రాశారు. ఆస్తుల పంపకం, విరాళాల గురించి అందులో పేర్కొన్నారు. మృతదేహాల కాళ్లు, చేతులు కట్టి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...